టీడీపీ కుట్ర బట్టబయలు.. మంత్రికి క్షమాపణ చెప్పిన మహిళ

29 Dec, 2022 08:53 IST|Sakshi

సాక్షి, అనంతపురం: మంత్రి ఉషాశ్రీచరణ్‌పై టీడీపీ కుట్ర రాజకీయాలు బట్టబయలయ్యాయి. మంత్రి ఉషాశ్రీచరణ్‌పై మహిళతో టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయించారు. మహిళ వ్యాఖ్యలను విస్తృతంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేశాయి. 

ఆ మహిళ.. మంత్రి ఉషశ్రీచరణ్‌ను కలిసి క్షమాపణ కోరింది. టీడీపీ ఒత్తిడి వల్లే ఆరోపణలు చేశానని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మంత్రి ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ, టీడీపీ నేతల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. అభివృద్ధి ఓర్వలేకే టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు.
చదవండి: ‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ..

మరిన్ని వార్తలు