చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెడతా: వైఎస్ షర్మిల

16 Jul, 2021 12:54 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచింది

మీడియా సమావేశంలో వైఎస్‌ షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే పార్టీని స్థాపించామని వైఎస్‌ షర్మిల అన్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెడతానని వెల్లడించారు.  వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆమె తొలిసారి  మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. హుజురాబాద్ ఉపఎన్నికకు అర్ధమే లేదని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు