100 మంది పవన్ కల్యాణ్‌లు కలిసి వచ్చినా.. జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరు

20 Oct, 2022 19:10 IST|Sakshi

సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నాని పవన్ కల్యాణ్‍పై ఫైర్ అ‍య్యారు. పవన్ సిగ్గులేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడుస్తున్నాడని విమర్శించారు. అందుకే ప్రజలు, తాము పీకేని ప్యాకేజ్ స్టార్ అనుకుంటున్నామని పేర్కొన్నారు. పవన్ బ్రహ్మానందం డైలాగులు వదిలి సక్రమమైన మార్గంలో వెళ్లాలని కొడాలి సూచించారు. చంద్రబాబు కోసం చిల్లర వేషాలు వేస్తూ పవన్ కల్యాణ్‌ చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలన్నారు.

ఈ దాచిన చెప్పుతో 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు ముందు తాను కొట్టుకొని, ఆ తర్వాత తన స్థితికి కారణమైన చంద్రబాబును పవన్‌ కొట్టాలని కొడాలి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఏర్పడిందని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌కు కాపులు, ప్రజలు ముఖ్యం కాదని సీఎం జగన్‌ను గద్దె దించడమే ప్రధానమని మండిపడ్డారు. 100 మంది పవన్ కల్యాణ్‌లు కలిసి వచ్చినా జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరన్నారు.

పవన్‌కు ఆత్మాభిమానం కంటే ప్యాకేజీనే ముఖ్యం. జేఏసీ గర్జన నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికే పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు వైజాగ్ పంపాడు. ఉద్దేశపూర్వకంగానే మా మంత్రులను బూతులు తిడుతూ దాడి చేశారు. అందుకే అవుట్ గేటులో ఉండాల్సిన , జనసేన నేతలు ఎయిర్ పోర్టు ఇన్ గేట్ మార్గంలోకి జనసేన నేతలు వచ్చారు.  ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండా వేరే పార్టీకి మద్దతు తెలిపిన ఏకైక పార్టీ జనసేన. ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్‌ రాజకీయ కాల్షీట్లు ఇస్తున్నాడు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడం పవన్ లక్ష్యమైతే.. ప్రజలకు మంచి చేయడం, దేవుడి ఆశీస్సులు, 175 సీట్లు జగన్ లక్ష్యం. అని కొడాలి నాని పేర్కొన్నారు.
చదవండి: దత్తపుత్రుడికి సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

మరిన్ని వార్తలు