ఏపీ మత సామరస్యానికి ప్రతీక

16 Jan, 2021 12:42 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, తిరిగి అధికారంలోకి రాలేననే భయంతో విషప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: దశలవారీగా అందరికి వ్యాక్సినేషన్‌: సుచరిత)

‘‘ఏపీ మత సామరస్యానికి ప్రతీక.. మతాల మధ్య ఘర్షణ లేనే లేదు. టీడీపీ, బీజేపీ కలిసి చేసిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించం.బూట్లు వేసుకుని పూజలు చేసే నీకు హిందూత్వంపై ప్రేమ ఉందా?. అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని’’ అంబటి రాంబాబు హెచ్చరించారు. (చదవండి: టీడీపీకి బిగ్‌షాక్‌.. బీజేపీలోకి కీలక నేత!)

మరిన్ని వార్తలు