ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో వేదిక ఏర్పాటు చేసే అర్హత టీడీపీకి లేదు
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్, చంద్రబాబు హయాంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు, టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్రను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూసిందని ఆయన దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో వేదిక ఏర్పాటు చేసే అర్హత టీడీపీకి లేదన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు ఓర్వలేకే పరిపాలన రాజధానిగా విశాఖకు అడ్డుపడుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. గతంలో కేంద్రమంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు అలసత్వం వల్లే విశాఖ స్టీల్ప్లాంట్కు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.
ఇవీ చదవండి:
మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు