సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదు: ఎమ్మెల్యే రోజా

8 Jun, 2021 15:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్‌కు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు చెప్పినట్టు పార్టీ లేదు.. తొక్కా లేదన్నట్లే టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సీఎం జగన్‌ పాలనను నీతి అయోగ్‌ ప్రశంసించిందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

చదవండి: జగనన్న తోడు: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌ 
బీపీవో ఉద్యోగాలు..ఏపీ నుంచే అత్యధికం

మరిన్ని వార్తలు