MLA Roja: రైతులను దగా చేసిన పార్టీ టీడీపీనే

9 Jul, 2021 11:42 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌ జయంతి ఘనంగా జరుపుకున్నామన్నారు. రైతులను దగా చేసిన పార్టీ టీడీపీనే అంటూ ఆమె నిప్పులు చెరిగారు. రాజశేఖర్‌రెడ్డి పాలన అంటే రైతురాజ్యంగా పేరు పొందిందన్నారు. సీఎం జగన్‌ కూడా రైతు రాజ్యంగా పాలన సాగిస్తున్నారని రోజా అన్నారు. సీఎం వైఎస్‌ జగన్ రూ.83 వేల కోట్లను వివిధ పథకాల ద్వారా రైతులకి అందించారని గుర్తు చేశారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జల వివాదాలే లేవని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఉండాల్సింది పోయి, దొంగల్లా పారిపోయి వచ్చి, విజయవాడ నడిరోడ్డులో వదిలేసింది చంద్రబాబు కాదా అని ఆమె ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఒక కోవర్డ్‌రెడ్డి అంటూ దుయ్యబట్టారు. బీజేపీ నాయకుల దిగజారుడు మాటలు పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, అందుకే కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ రాశారన్నారు. రాష్ట్ర విభజన హక్కులు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు.

మరిన్ని వార్తలు