‘అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలు’

14 Nov, 2021 13:47 IST|Sakshi

ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

సాక్షి, ప్రకాశం జిల్లా: అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాదయాత్రను వైఎస్సార్‌సీపీ నేతలు ఆపలేదన్నారు. టీడీపీ వాళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. పాదయాత్రకు ప్రజామద్దతు లేదని.. కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే రోడ్లపై నడుస్తున్నారన్నారు. పాదయాత్ర పేరుతో అశాంతి రేపాలని చూస్తే తిప్పి కొడతామని సుధాకర్‌బాబు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు