స్పౌజ్‌ బదిలీలు చేపట్టాలి

24 Jan, 2023 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తును చక్కదిద్దే గురువులు పిల్లాపాపలతో ప్రగతి భవన్‌ ముందు ఆర్తనాదాలు చేయాల్సిన దుస్థితికి సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో కేసీఆర్‌ సైకోలా వ్యవహరిస్తున్నారని సోమ వారం ట్విట్టర్‌ వేదికగా దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్‌ గడీ దాటి బయటకు వచ్చి బ్లాక్‌ చేసిన 13 జిల్లాల స్పౌజ్‌ బదిలీలను వెంటనే చేపట్టాలని షర్మిల డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు