టీడీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు: వైవీ సుబ్బారెడ్డి

2 May, 2021 16:14 IST|Sakshi

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీకే తిరుపతి ప్రజలు పట్టి.. టీడీపీ కుట్రలను తిప్పికొట్టారని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఊహించినదేనన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

కాగా, తిరుపతి ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.

చదవండి: తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం 
తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు

మరిన్ని వార్తలు