రంగారెడ్డి: పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ప్రియుడు మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతిరెడ్డిపల్లికి చెందిన బీ అపర్ణ(20) గ్రామంలోనిజెడ్పీహెచ్ఎస్లో కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తోంది.
అదే గ్రామానికి చెందిన బీ శివ అనే యువకుడు అపర్ణను కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కానీ శివ ఇటీవల తన మేనమామ కూతురును పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అపర్ణ మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.