మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన తన అభిప్రాయలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఒక చిన్నపిల్లాడు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఉంటాడు.
ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా ‘నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ వీడియోను చూస్తుంటాను. ఇది ఎంతో మంది అద్భుతమైన కళాకారులు చేసిన మ్యూజిక్ లా అనిపిస్తుంది. ఈ పిల్లోడి అమాయకత్వం, కాన్ఫిడెన్స్ నాలో జోష్ను నింపి నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సామాజిక దూరం పాటిస్తూ జెండా ఆవిష్కరణకు ప్రతి చోట చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
I saw this first a year or more ago. I’ve stored it and I watch it every year to get my josh up before Independence Day. It moves me as much as the best rendition of our anthem by the most accomplished musicians. His innocence & concentration gets me every time. #friday pic.twitter.com/gFnj66cisd
— anand mahindra (@anandmahindra) August 14, 2020