జాతీయ రహదారిపై 170 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కేంద్ర మంత్రి

20 Sep, 2021 17:19 IST|Sakshi

దేశ రోడ్డు రవాణా వ్యవస్థలో కీలకమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి కేంద్రం రూ.98 వేల కోట్లతో ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను 2019 నుంచి చేపడుతుంది. ఈ ప్రాజెక్టు పనులను కేంద్రం మంత్రి గడ్కరీ తనిఖీ చేశారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఈ రహదారి మీద నితిన్ గడ్కరీ స్పీడ్ టెస్ట్ నిర్వహించారు.

నిర్మాణ దశలో ఉన్న ఈ రహదారి మీద 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లారు. రత్లామ్ జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులను పరిశీలించే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అకస్మాత్తుగా తన పక్కనున్న వ్యక్తితో కారు వేగాన్ని పెంచామని సూచించారు.. దీంతో ఆ వ్యక్తి వెంటనే కారును 170 కి.మీ వేగంతో తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ లోకేంద్ర పరాశర్ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గడ్కరీ ఇంతకు ముందు హెలికాప్టర్ లో ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు.(చదవండి: అమ్మకానికి విరాట్‌ కోహ్లి కారు ? ధర ఎంతంటే)

 
ఇప్పటివరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ.1.50 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు ప్రాజెక్టుల కోసం మరో లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నాను అని ఆయన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్లు గడ్కరీ పేర్కొన్నారు. 45 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ తనిఖీలో గడ్కరీతో పాటు ఎంపిలు గుమాన్ సింగ్ దామోర్, అనిల్ ఫిరోజియా, సుధీర్ గుప్తా, రత్లాం జిల్లా ఎమ్మెల్యే చేతన్యా కశ్యప్ ఉన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల గుండా వెళుతుంది, వీటిలో రత్లామ్, మాండ్ సౌర్, ఝబువా ఉన్నాయి.

మరిన్ని వార్తలు