వారికి కావాల్సింది ఎద్దులు కాదు.. ట్రాక్టర్‌ అంటూ..

26 Jul, 2020 16:07 IST|Sakshi

సినీ పరిశ్రమలో ఎంతమంది హీరోలున్నా కరోనా సమయంలో పేదల జీవితాల్లో హీరోగా నిలుస్తున్నది మాత్రం ఒక్కరే. అతనే సోనూసూద్‌. లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున​ తరుణంలో ఎంతో మందికి ఆయన సాయం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్‌ వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ఆ కుటుంబానికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. (సోనూ సూద్ గొప్ప ప్రయత్నం)

మ‌రికొద్దిసేటికే ఆయన మరోసారి స్పందిస్తూ వారికి కావాల్సింది ఎద్దులు కాదు.. ట్రాక్ట‌ర్. అది ఆదివారం సాయంత్రానికి వారి పొలంలో ఉంటుంది. ఇకపై ఆ అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. అయితే ఖరీఫ్‌ సీజన్‌లో సేద్యం పనులు చేయడానికి ఆ రైతుకు కాడెద్దులు లేకపోవడంతో అతని ఇద్దరు కూతుళ్లే కాడెద్దులుగా మారారు. ఆ అమ్మాయిలు ఇద్దరు కాడి లాగడం, వెనుకనుంచి తల్లిదండ్రులిద్దరూ విత్తనాలు వేయడం సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన సోనూసూద్‌ నేనున్నానంటూ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చి మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు.

మరిన్ని వార్తలు