2022 BMW Open: క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట ఓటమి

29 Apr, 2022 05:19 IST|Sakshi

బీఎండబ్ల్యూ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీ నుంచి రోహన్‌ బోపన్న (భారత్‌)–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది.  మ్యూనిక్‌లో గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్‌ ద్వయం 3–6, 4–6తో మటోస్‌ (బ్రెజిల్‌)–డేవిడ్‌ వెగా హెర్నాండెజ్‌ (స్పెయిన్‌) జోడీ చేతిలో ఓడింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 4,950 యూరోల (రూ. 3 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.

మరిన్ని వార్తలు