ABN AMRO Tennis Tournament: ఫైనల్లో బోపన్న జోడీ

19 Feb, 2023 06:41 IST|Sakshi

ఏబీఎన్‌ ఆమ్రో ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–4, 6–4తో కెవిన్‌ క్రాయిట్జ్‌–టిమ్‌ పుయిట్జ్‌ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశారు.

మరిన్ని వార్తలు