All England Badminton Tourney 2023: సీడింగ్‌ లేకుండానే బరిలోకి భారత ఆటగాళ్లు

14 Mar, 2023 10:21 IST|Sakshi

ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నేడు (మార్చి 14) బర్మింగ్‌హామ్‌లో మొదలుకానుంది. 2001లో పుల్లెల గోపీచంద్‌ తర్వాత మరో భారత ప్లేయర్‌ ఈ టోర్నీ టైటిల్‌ను సాధించలేకపోయాడు.

మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌ టైటిల్‌ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2009 తర్వాత తొలిసారి భారత క్రీడాకారులెవరికీ సీడింగ్‌ లభించలేదు. 

మరిన్ని వార్తలు