Ranji Trophy 2022: చెలరేగిన అయ్యప్ప, పృథ్వీరాజ్‌.. కుప్పకూలిన ఉత్తరాఖండ్

4 Mar, 2022 08:25 IST|Sakshi

తుంబా: ఆంధ్ర పేసర్లు బండారు అయ్యప్ప (4/37), పృథ్వీరాజ్‌ (3/27) ధాటికి రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘ఇ’లో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. కునాల్‌ చండీలా (52; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కమల్‌ సింగ్‌ (42; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఆంధ్ర 12 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్‌ (25), షేక్‌ రషీద్‌ (10) క్రీజులో ఉన్నారు. 

చదవండి: IND vs SL 1st Test: శ్రీలంకతో టీమిండియా తొలిపోరు.. కోహ్లి మెరిసేనా..?

>
మరిన్ని వార్తలు