Ashes Series 2021: తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌

7 Dec, 2021 13:48 IST|Sakshi

Ashes Series 2021: England Announces 12 Man Squad For Gabba Test: ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ నేపథ్యంలో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ తమ జట్టును ప్రకటించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా డిసెంబరు 8న మొదలుకానున్న మ్యాచ్‌ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. మోకాలి నొప్పి కారణంగా వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ జట్టుకు దూరం కాగా... మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, ఓలీ రాబిన్సన్‌ స్పెషలిస్టు ఫాస్ట్‌బౌలర్లుగా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కాగా జో రూట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.

గబ్బా టెస్టుకు ఇంగ్లండ్‌ ప్రకటించిన జట్టు:
►జో రూట్‌(కెప్టెన్‌), స్టువర్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, హసీబ్‌ హమీద్‌, జాక్‌ లీచ్‌, డేవిడ్‌ మలాన్‌, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్సన్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్ వోక్స్‌, మార్క్‌ వుడ్‌.

యాషెస్‌ సిరీస్‌ 2021- షెడ్యూల్‌:
మొదటి టెస్టు: డిసెంబరు 08-12: గబ్బా
►రెండో టెస్టు: డిసెంబరు 16-20: అడిలైడ్‌
►మూడో టెస్టు: డిసెంబరు 26- 30: మెల్‌బోర్న్‌
►నాలుగో టెస్టు: జనవరి 5-9: సిడ్నీ
►ఐదో టెస్టు: జనవరి 14-18

చదవండి: Sara Tendulkar: మోడలింగ్‌లో అడుగుపెట్టిన సచిన్‌ తనయ.. వీడియో వైరల్‌
చదవండి: Australia Ashes Squad: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్‌.. వరల్డ్‌కప్‌ హీరోకు నో ఛాన్స్‌.

మరిన్ని వార్తలు