Asia Cup 2022: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి ఆటగాడిగా!

29 Aug, 2022 08:45 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ను అధిగమించి రోహిత్‌ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 3499 పరుగులతో రోహిత్‌ టాప్‌లో ఉండగా.. గప్టిల్‌(3497), విరాట్‌ కోహ్లి(3341) పరుగులతో రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది.

మ్యాచ్‌ సంక్షిప్త​ సమాచారం
టాస్‌: భారత్‌ బౌలింగ్‌
పాకిస్తాన్‌: 147/10
పాక్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌: మహ్మద్ రిజ్వాన్(42 బంతుల్లో 43 పరుగులు)
భారత బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగు వికెట్లు, హార్ధిక్‌ పాండ్యా 3వికెట్లు, అర్షదీప్‌ సింగ్‌ 2వికెట్లు
టీమిండియా : 148/5(19.4 ఓవర్లు)
భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్లు: విరాట్‌ కోహ్లి(35), జడేజా(35)
పాక్‌ బౌలింగ్‌: మహ్మద్‌ నవాజ్‌ మూడు వికెట్లు, నషీమ్‌ షా రెండు వికెట్లు
విజేత: 5 వికెట్ల తేడాతో పాక్‌పై టీమిండియా విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హార్దిక్‌ పాండ్యా( మూడు వికెట్లతో పాటు 33 పరుగులు (నాటౌట్‌))

చదవండి: Asia Cup 2022: 'కూల్‌గా ఉండు కార్తీక్‌ భాయ్‌.. నేను ఫినిష్‌ చేస్తా'! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు