ఆసియా కప్‌ టి20 టోర్నీ రద్దు

20 May, 2021 06:23 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీ రద్దయింది. కరోనా నేపథ్యంలో టోర్నీని నిర్వహించే స్థితిలో తాము లేమని శ్రీలంక క్రికెట్‌ బోర్డు సీఈఓ యాష్లే డి సిల్వా ప్రకటించారు. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది పాకిస్తాన్‌లో జరగాల్సింది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌లో భారత్‌ పర్యటించే అవకాశం లేకపోవడంతో టోర్నీ వేదికను పాక్‌ నుంచి శ్రీలంకకు మార్చారు. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన అన్ని జట్లు అంతర్జాతీయ క్రికెట్‌లో రెండేళ్లపాటు బిజీగా ఉండటంతో ఆసియా కప్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత జరిగే అవకాశముంది. ఆసియా కప్‌ను 2016 నుంచి రొటేషన్‌ పద్ధతిలో వన్డే, టి20 ఫార్మాట్‌లలో నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు