Asia Mixed Team Badminton Championship: భారత్‌ శుభారంభం

15 Feb, 2023 12:25 IST|Sakshi

Asia Mixed Team Badminton Championships 2023- దుబాయ్‌: ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం గ్రూప్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో కజకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఇషాన్‌–తనీషా ద్వయం 21–5, 21–11తో మక్సుత్‌–నర్గీజా జోడీపై నెగ్గింది.

రెండో మ్యాచ్‌లో ప్రణయ్‌ 21–9, 21–11తో  పనారిన్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో సింధు 21–4, 21–12తో కామిలాపై నెగ్గడంతో భారత విజయం ఖరారైంది. తర్వాతి మ్యాచ్‌ల్లో గరగ కృష్ణప్రసాద్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌ 21–10, 21–6 తో కుల్మతోవ్‌–నియాజోవ్‌లను ఓడించగా.. పుల్లెల గాయత్రి –ట్రెసా జాలీ 21–5, 21–7తో నర్గీజా–ఐషా జుమ్‌బేక్‌లపై విజయం సాధించారు. 

చదవండి: Virat Kohli: రోహిత్‌పై ప్రేమ లేదు.. కానీ కోహ్లికి వ్యతిరేకం! బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ కామెంట్స్‌ వైరల్‌
WPL 2023: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌, వేదికలు.. ఫైనల్‌ అప్పుడే!
Ind Vs Aus 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా

మరిన్ని వార్తలు