భారత్‌-న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌: తొలి మ్యాచ్‌ కష్టమేనా?

15 Nov, 2021 19:26 IST|Sakshi

Pollution threat Looms Large on 1st T20 Against IND VS NZ:  టీ20 ప్రపంచకప్‌-2021 ఫైనల్లో ఆసీస్‌ చేతి అనుహ్యంగా ఓటమి చెందిన న్యూజిలాండ్‌.. తదుపరి భారత పర్యటనకు సిద్దమవుతుంది.  ఈ పర్యటనలో భాగంగా నవంబర్‌17న తొలి టీ20 మ్యాచ్‌లో జైపూర్‌ వేదికగా భారత్‌తో తలపపడనుంది. అయితే జైపూర్‌లో గత వారం రోజులుగా కాలుష్య స్థాయిలు  విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‎పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

అయితే శీతాకాలంలో పొగమంచు కూడా ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది అని ఓ నివేదిక పేర్కొంది. నివేదిక  ప్రకారం.. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత కలుషితంగా ఉందని, జైపూర్ సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  337  వద్ద నమోదైనట్లు తెలిపింది. ఈ ఇక ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు జైపూర్‌ చెరుకోగా, ​కీవిస్‌ ఆటగాళ్లు సోమవారం​(నవంబర్‌ 15)న చేరుకోనున్నారు. కాగా అంతక ముందు 2017లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా పొగమంచు కారణంగా  శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆడారు. అప్పుడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 316 గా నమోదైంది.

చదవండి: ఆ అవార్డు వార్నర్‌కు ఎలా ఇస్తారు..? మా వాడు ఉన్నాడుగా: షోయబ్ అక్తర్

మరిన్ని వార్తలు