Gymnast Aruna Reddy: 5 లక్షల నజరానా అందజేసిన అరబిందో ఫార్మా

24 Dec, 2021 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈజిప్ట్‌లో జరిగిన ఫారోస్‌ కప్‌ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ టోర్నమెంట్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్‌ బుద్దా అరుణా రెడ్డికి అరబిందో ఫార్మా లిమిటెడ్‌ రూ. 5 లక్షలు నజరానాగా అందజేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌  కె.నిత్యానందరెడ్డి జిమ్నాస్ట్‌ అరుణా రెడ్డిని సన్మానించి రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు.  

మరిన్ని వార్తలు