మరో నాలుగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలు రద్దు

30 Jul, 2020 05:44 IST|Sakshi

టోక్యో: కరోనా ఖాతాలో మరో నాలుగు టోర్నీలు చేరాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) బుధవారం తాజాగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తైపీ ఓపెన్‌ (సెప్టెంబర్‌ 1–6), కొరియా ఓపెన్‌ (8–13), చైనా ఓపెన్‌ (15–20), జపాన్‌ ఓపెన్‌ (22–27)లను నిర్వహించబోమని సమాఖ్య వెల్లడించింది. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అందరి ఆరోగ్యభద్రత దృష్ట్యా టోర్నీల రద్దుకే మొగ్గుచూపామని బీడబ్ల్యూఎఫ్‌ కార్యదర్శి థామస్‌ లుండ్‌ పేర్కొన్నారు. ఈ మహమ్మారి కారణంగానే ఇటీవల చైనాలో జరగాల్సిన 11 టెన్నిస్‌ టోర్నీలు రద్దు కాగా... మంగళవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీఏ పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ తొలిసారిగా రద్దయింది.

మరిన్ని వార్తలు