శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో మే 15 న చిట్టగాంగ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు షకీబ్ ఆల్ హాసన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
షకీబ్ ఆల్ హాసన్కు కరోనా పాజిటివ్గా తేలింది. అతడు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. మళ్లీ అతడికి కొన్ని రోజులు తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తాం. అయితే అతడు తొలి టెస్టుకు దూరం కానున్నాడు అని బీసీబీ అధికారి పేర్కొన్నారు.
చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్కు భారీ షాక్!