Women’s IPL: మహిళల ఐపీఎల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. వచ్చే ఏడాది నుంచే షురూ..!

25 Mar, 2022 18:55 IST|Sakshi

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు మహిళల క్రికెట్‌కి సంబంధించి ఓ గుడ్‌ న్యూస్‌ వెలువడింది. పురుషుల ఐపీఎల్‌ తరహాలోనే వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో కూడిన మహిళా ఐపీఎల్‌ నిర్వహించనున్నట్లు బీసీసీఐ బాస్‌ సౌరవ్ గంగూలీ ఇవాళ (మార్చి 25) ప్రకటించారు. ముంబైలో జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా మహిళల ఐపీఎల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 
చదవండి: ఐపీఎల్‌ మోస్ట్‌ లక్కీ ప్లేయర్‌ కర్ణ్‌ శర్మ.. ఎందుకంటే..?

మరిన్ని వార్తలు