UEFA EURO 2020: పోర్చు‘గల్లంతు’

29 Jun, 2021 05:39 IST|Sakshi

సెవిల్లె (స్పెయిన్‌): యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ పోర్చుగల్‌ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బెల్జియం 1–0 గోల్‌ తేడాతో క్రిస్టి యానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టును ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి చేరింది.

ఆట 42వ నిమిషంలో ఎడెన్‌ హజార్డ్‌ గోల్‌తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది.  సోమవారం జరిగిన మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్‌ 5–3తో క్రొయేషియాను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

మరిన్ని వార్తలు