భారత మహిళల క్రికెట్‌ టీమ్‌కు శుభారంభం దక్కేనా!

21 Sep, 2021 04:49 IST|Sakshi

నేడు భారత్, ఆసీస్‌ తొలి వన్డే

ఉ. గం. 5.35 నుంచి సోనీ సిక్స్‌లో లైవ్‌

మెకాయ్‌: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్ల చేతుల్లో ఎదురైన వన్డే సిరీస్‌ పరాభవాల తర్వాత భారత మహిళల జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పర్యటనను నేడు జరిగే తొలి వన్డేతో భారత్‌ ఆరంభించనుంది.

బొటనవేలి గాయంతో వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌కు దూరమైంది.  2018 మార్చి నుంచి ఆస్ట్రేలియాకు వన్డేల్లో ఓటమనేదే లేదు. ఈ మధ్య కాలంలో ఆ జట్టు 24 మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ విజయం సాధించిది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్‌ అన్ని విభాగాల్లోనూ విశేషంగా రాణించాలి.

మరిన్ని వార్తలు