BWF World Tour Finals: ప్రణయ్‌ తొలిసారి... మొదటి మ్యాచ్‌లో నరోకాతో ‘ఢీ’

7 Dec, 2022 08:49 IST|Sakshi

BWF World Tour Finals 2022: బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు భారత అగ్రశ్రేణి షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మొదటిసారి అర్హత సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)తో ప్రణయ్‌ ఆడనున్నాడు.

బ్యాంకాక్‌లో బుధవారం నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’లో ప్రణయ్‌తోపాటు ఒలింపిక్‌ చాంపియన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), లూ గ్వాంగ్‌ జు (చైనా), నరోకా ఉన్నారు. నరోకాతో ఈ ఏడాది  సింగపూర్‌ ఓపెన్‌లో ఆడిన ప్రణయ్‌ మూడు గేముల్లో ఓడిపోయాడు.  

చదవండి: IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? 
Virender Sehwags son: క్రికెట్‌లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక

మరిన్ని వార్తలు