Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా ఇదే.. ఆంధ్ర అమ్మాయికి చోటు

12 Jul, 2022 08:09 IST|Sakshi

ముంబై: ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్‌ జట్టును ప్రకటించారు. టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సబ్బినేని మేఘనకు కూడా జట్టులో చోటు లభించింది.   
భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్‌ రాణా. 

మరిన్ని వార్తలు