ఐసీసీ సిబ్బందికి కరోనా 

27 Sep, 2020 08:00 IST|Sakshi

న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రధాన కార్యాలయంలోని సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దుబాయ్‌లో ఉన్న ఈ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి కోవిడ్‌–19 పాజిటివ్‌ రావడంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నిబంధనల ప్రకారం కొన్ని రోజులు కార్యాలయం మూసి వేయనున్నారు. కార్యాలయ సిబ్బంది ఇంటి నుంచే పనిచేస్తారు. దుబాయ్‌లో ఉన్న ఆరు ఐపీఎల్‌ జట్లు ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. అయితే అకాడమీకి, ఐసీసీ కార్యాలయం మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్‌ జట్లకు ప్రాక్టీస్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సమాచారం. 

మరిన్ని వార్తలు