CWG 2022: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో గెలుపు.. ఫైనల్‌కు భారత పురుషుల హాకీ జట్టు

7 Aug, 2022 07:35 IST|Sakshi

భారత పురుషుల హాకీ జట్టు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో తమ జోరును ప్రదర్శిస్తోంది. శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 3-2 తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన భారత్‌ స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే అభిషేక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఖాతాలో తొలి గోల్‌ నమోదైంది. ఆ తర్వాత మణిదీప్‌ సింగ్‌ మరో గోల్‌ మెరవడంతో భారత్‌ 2-0తో ఆధిక్యంలో వెళ్లింది.

ఇక మూడో క్వార్టర్‌లో సౌతాఫ్రికా తరపున రెయాన్‌ జూలిస్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో క్వార్టర్‌ మొదలైన రెండో నిమిషంలోనే డ్రాగ్‌ ఫ్లికర్‌ జుగ్‌రాజ్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక సౌతాఫ్రికా తరపున రెండో గోల్‌ నమోదు చేసింది. అయితే చివర్లో కాస్త ఉ‍త్కంఠ నెలకొన్నప్పటికి భారత్‌ ప్రత్యర్థిని గోల్స్‌ చేయకుండా అడ్డుకొని ఫైనల్లోకి ప్రవేశించింది. 

చదవండి: CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్‌ పటేల్‌

మరిన్ని వార్తలు