క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌ జోడీ 

9 Feb, 2023 08:39 IST|Sakshi

Saketh Myneni- Yuki Bhambri: డాలస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–యూకీ ద్వయం 5–7, 7–6 (7/3), 10–3తో క్రిస్టోఫర్‌ యుబ్యాంక్స్‌–మార్కస్‌ జిరోన్‌ (అమెరికా) జోడీపై గెలిచింది.

గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–యూకీ మూడు ఏస్‌లు సంధించారు. క్వార్టర్‌ ఫైనల్లో జూలియన్‌ క్యాష్‌–హెన్రీ ప్యాటర్న్‌ (బ్రిటన్‌)లతో సాకేత్‌–యూకీ ఆడతారు.    
చదవండి: Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్‌ ఓపెనర్ల అరుదైన ఘనత
T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

మరిన్ని వార్తలు