ఢిల్లీ మోత మోగించింది..

3 Oct, 2020 21:25 IST|Sakshi

షార్జా:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 229 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీ షా(66; 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(88 నాటౌట్‌; 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌( 38 ; 17 బంతుల్లో  5 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. (చదవండి: మ్యాజికల్‌ పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా రికార్డు)

ఢిల్లీ ఇన్నింగ్స్‌ను  పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు ధాటిగా ఆరంభించారు. పృథ్వీ షా ఆది నుంచి కేకేఆర్‌ బౌలర్లపై దాడికి దిగాడు. ఈ జోడి 56 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌(26; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో పృథ్వీషాకు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జత కలిశాడు. ఈ జోడి 73 పరుగులు జత చేసిన తర్వాత పృథ్వీ షా రెండో వికెట్‌గా ఔటయ్యాడు. నాగర్‌కోటి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన పృథ్వీ షా.. శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. అనంతరం అయ్యర్‌-పంత్‌ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.

ప్రతీ ఓవర్‌లో కనీసం పది పరుగులు ఉండాలనే లక్ష్యంతో వీరిద్దరూ బ్యాటింగ్‌ చేశారు. ఒక ఫోర్‌ కొడితే, మరొకరు సిక్స్‌ అన్నట్లు వీరి బ్యాటింగ్‌ సాగింది. ఈ జోడి 72 పరుగులు జత చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తిలకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ 49 పరుగులు ఇవ్వగా, మావి 3 ఓవర్లలో 40 పరుగులిచ్చాడు. ఇక నాగర్‌కోటి మూడు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చాడు. వరుణ్‌ చక్రవర్తి తన నాలుగు ఓవర్ల కోటాలో 49 పరుగులు సమర్పించుకున్నాడు.రసెల్‌ ఒక్కడే 4 ఓవర్లలో రెండు వికెట్లు సాధించి 29 పరుగులిచ్చాడు ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు వచ్చాయి. 

మరిన్ని వార్తలు