Denmark Open 2022: డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం

22 Oct, 2022 20:17 IST|Sakshi

ఓడెన్స్‌ (డెన్మార్క్): డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం​ జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్‌లో కామన్‌వెల్త్ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్.. జపాన్‌కు చెందిన కొడాయ్ నరవోకా చేతిలో 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలవ్వగా, ఇవాళ (అక్టోబర్‌ 22) జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకీరెడ్డి జోడీ.. డిఫెండింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్స్‌, మలేషియాకు చెందిన ఆరోన్‌ చియా-సో వేయ్‌ ఇక్‌ జోడీ చేతిలో 16-21, 19-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

వీరి ఓటమితో ఈ టోర్నీలో భారత పోరాటం సమాప్తమైంది. ఈ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిదాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌ ప్రిలిమినరీ దశలో ఓటమిపాలయ్యారు. 

మరిన్ని వార్తలు