టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని.. ఐపీఎస్ ఆఫీసర్ జి. సంపత్ కుమార్పై మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తి కలిగించింది. క్రికెట్ బెట్టింగ్ సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ధోనీ ఆరోపించాడు.
ధోని పిటిషన్ ప్రకారం.. 2014లో హైకోర్టులో సంపత్ కుమార్ దావా వేశారని.. గతంలో ఆయన చేసిన ఆరోపణలు తనకు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ఐపీఎస్ సంపత్ కుమార్ సహా పలువురు అధికారులపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు ధోని తెలిపాడు.
చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు..