IPL 2023: సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. ధోని దూరం! కెప్టెన్‌గా రుత్‌రాజ్‌

30 Mar, 2023 17:09 IST|Sakshi
( Photot Credit: IPL/BCCI)

ఐపీఎల్‌-2023 సీజన్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నైసూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఊహించని షాక్‌ తగిలింది. ఆజట్టు కెప్టెన్‌ ఎంఎస్ ధోని గుజరాత్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోని ఎడమ కాలికి గాయమైనట్లు "స్పోర్ట్‌స్టార్‌" తమ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో అతడికి తొలి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని సీఎస్‌కే వైద్యబృందం సూచించినట్లు సమాచారం. ఒక వేళ ధోని దూరమైతే బెన్‌స్టోక్స్ లేదా రుతురాజ్ గైక్వాడ్ చెన్నై కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా): డెవాన్ కాన్వే(వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివం దూబే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరనా

మరిన్ని వార్తలు