లా రోడా ఓపెన్‌ చెస్‌ టోర్నీ విజేత గుకేశ్‌

19 Apr, 2022 08:50 IST|Sakshi

Dommaraju Gukesh- భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ స్పెయిన్‌లో జరిగిన లా రోడా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల గుకేశ్‌ నిర్ణీత 9 రౌండ్‌ల తర్వాత 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.

గుకేశ్‌ ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా ముగించాడు. చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ. 2 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
చదవండి: Vishwa Deenadayalan Death: రోడ్డు ప్రమాదంలో యువ ప్లేయర్ దుర్మరణం 

మరిన్ని వార్తలు