హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్‌

11 Oct, 2022 18:49 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్‌ ధవన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్‌ అయ్యింది. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్‌ ఎక్సెల్‌ సినిమాతో గబ్బర్‌ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

A post shared by Huma Qureshi (@iamhumaq)

చిత్ర కధానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ.. గబ్బర్‌తో కలిసి రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేస్తున్న సీన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. క్యాట్‌ ఈజ్‌ ఔట్‌ ఆఫ్‌ ది బ్యాగ్‌... ఫైనల్లీ అంటూ శిఖర్‌ ధవన్‌ను ట్యాగ్‌ చేస్తూ క్యాప్షన్‌ జోడించింది. ఈ పోస్ట్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. 

సినిమా విషయానికొస్తే.. సత్రమ్ రమణి దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న డబుల్‌ ఎక్సెల్‌ చిత్రం అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు కాగా.. గబ్బర్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి భారీగా బరువు పెరిగారు. డబుల్‌ ఎక్సెల్‌ తెలుగులో ఆనుష్క నటించిన సైజ్‌ జీరోకు దగ్గరగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.   

మరిన్ని వార్తలు