సెమీఫైనల్లో ఓడిన సానియా జంట

20 Feb, 2022 05:30 IST|Sakshi

దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా (భారత్‌)–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జంట పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–2, 2–6, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ చేతిలో ఓడింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా–హర్డెస్కా జోడీకి 12,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 33 వేలు) లభించింది.

మరిన్ని వార్తలు