Durand Cup 2022: ముంబైని ఓడించి తొలిసారి విజేతగా బెంగళూరు.. ప్రైజ్‌మనీ ఎంతంటే

19 Sep, 2022 10:13 IST|Sakshi

డ్యూరాండ్‌ కప్‌-2022 టైటిల్‌ విజేత బెంగళూరు ఎఫ్‌సీ

Durand Cup 2022 Final- కోల్‌కతా: భారత్‌లో అత్యంత పురాతన ఫుట్‌బాల్‌ టోర్నీ డ్యూరాండ్‌ కప్‌ టైటిల్‌ను బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) తొలిసారి సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని బెంగళూరు 2–1తో ముంబై సిటీ ఎఫ్‌సీపై గెలిచింది.

బెంగళూరు తరఫున శివశక్తి (10వ ని.లో), అలన్‌ కోస్టా (61వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... ముంబై జట్టుకు అపుయా (30వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. చాంపియన్‌ బెంగళూరు కు రూ. 60 లక్షలు... రన్నరప్‌ ముంబై జట్టుకు రూ. 40 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.  

చదవండి: India Women vs England Women 2022 1st ODI: మెరిసిన స్మృతి, హర్మన్‌ప్రీత్‌

మరిన్ని వార్తలు