ENG vs Wi: అయ్యో పాపం విండీస్.. ఆఖ‌రి ఓవ‌ర్‌లో 28 ప‌రుగులు.. అయినా!

24 Jan, 2022 09:10 IST|Sakshi

బార్బడోస్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన ఉత్కంఠ బరిత పోరులో ఇంగ్లండ్ 1 పరుగు తేడాతో విజ‌యం సాధించింది. విజ‌యానికి ఆఖరి ఓవర్‌లో 29 ప‌రుగులు అవ‌స‌రం కాగా విండీస్  28 పరుగులు సాధించి ఓట‌మి పాలైంది. విండీస్ ఆట‌గాడు అకేల్ హోస్సేన్.. షాకిబ్ మహమూద్ వేసిన అఖ‌రి ఓవ‌ర్‌లో ఏకంగా 28 ప‌రుగులు రాబాట్టాడు. ఇక  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 171 ప‌రుగులు సాధించింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జాస‌న్ రాయ్‌(45), మోయిన్ అలీ(31), టామ్ బాంట‌న్‌(25) ప‌రుగుల‌తో రాణించారు.

విండీస్  బౌల‌ర్లలో హోల్డ‌ర్, ఫాబియ‌న్ ఆలీన్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక 172 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన విండీస్ 8 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు సాధించింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో రొమారియో షెపర్డ్(44), అకేల్ హోస్సేన్(44) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌ల‌గా నిలిచారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో మోయిన్ అలీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా,ఆదిల్ ర‌షీద్ రెండు వికెట్లు సాధించాడు. కాగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌1-1తో స‌మ‌మైంది.

చ‌ద‌వండి: SA vs IND: రాహుల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. తొలి భార‌త కెప్టెన్‌గా..

మరిన్ని వార్తలు