Tata Steel Chess Masters 2023: ఆఖరి స్థానంలో అర్జున్‌  

31 Jan, 2023 11:57 IST|Sakshi

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ నిరాశపరిచాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ఆన్‌జీ పట్టణంలో ముగిసిన ఈ టోర్నీలో అర్జున్‌ నాలుగు పాయింట్లు సాధించి చివరిదైన 14వ స్థానంలో నిలిచాడు.

మొత్తం 13 గేముల్లో అర్జున్‌ ఎనిమిదింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదు గేముల్లో  ఓడిపోయాడు. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీశ్‌ గిరి (8.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు.
చదవండివిషాదం: ప్రపంచ ఛాంపియన్‌.. మంచు కింద సజీవ సమాధి

మరిన్ని వార్తలు