టి20 ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత ఆటగాళ్ల ఫేలవమైన ఫీల్డింగ్ టీమిండియా కొంపముంచుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్లో మరీ బద్దకంగా కనిపించాడు. మార్ర్కమ్ రనౌట్ విషయంలో రోహిత్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియలో వైరల్గా మారింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఐదో బంతిని మిల్లర్ ఆన్సైడ్ ఆడాడు. సింగిల్కు కాల్ ఇచ్చిన మిల్లర్ పరిగెత్తేలోపే బంతి రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న మార్క్రమ్ క్రీజు మధ్యలోనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ మంచి రనౌట్ చాన్స్ మిస్ చేశాడు. ఎంత టైమ్ గ్యాప్ ఉందంటే.. డైరెక్ట్ హిట్ కాకపోయినా.. కనీసం వేగంగా పరిగెత్తి వికెట్లను తాకించినా మార్క్రమ్ ఔటయ్యేవాడు. అలా బంగారం లాంటి రనౌట్ చాన్స్ మిస్ అయింది. అంతకముందు కోహ్లి కూడా మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్ను వదిలేశాడు. అలా రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకన్న మార్క్రమ్ అర్థసెంచరీతో మెరిశాడు.
Virat Kohli drops a catch & Rohit Sharma misses a run-out❌
Aiden Markram survivies twice in an over!
📸: Disney + Hotstar pic.twitter.com/pxAjo6xsWS
— CricTracker (@Cricketracker) October 30, 2022
చదవండి: తెలివిగా వ్యవహరించిన కార్తిక్.. లాస్ట్ మ్యాచ్ హీరో జీరో అయ్యాడు