IND Vs AUS: వింతగా ప్రవర్తించిన టీమిండియా అభిమానులు..

11 Mar, 2023 09:16 IST|Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. ఉస్మాన్‌ ఖవాజా 180 పరుగులతో టీమిండియాపై కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. కామెరాన్‌ గ్రీన్‌ డెబ్యూ టెస్టు శతకంతో చెలరేగాడు. వెరసి ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలిసారి 400 పరుగులు మార్క్‌ను చేరుకుంది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో చెమటోడ్చారు. ఆ తర్వాత కూడా టెయిలెండర్లు ప్రతిఘటించడంతో 480 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌ ఆరు వికెట్లతో చెలరేగాడు.  ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. మూడోరోజు ఆట టీమిండియాకు కీలకం కానుంది.

ఇక రెండోరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు హాజరైన అభిమానులు కాస్త వింతగా ప్రవర్తించారు. రెండో రోజు చివరి సెషన్‌లో సూర్యకుమార్‌ కనిపించగానే సూర్య.. సూర్య అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత మహ్మద్‌ షమీ కనిపించగానే షమీ.. జై శ్రీరామ్‌.. షమీ.. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. అయితే షమీ దీనిని పెద్దగా పట్టించుకోకుండా అభివాదం చేశాడు.

ముస్లిం, హిందులకు ప్రతీకగానే జై శ్రీరామ్‌ నినాదాలు చేసినట్లు ఒక అభిమాని వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ గర్వంగా చెప్పుకున్నాడు. ఇక షమీ పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌తో పాటు మార్నస్‌ లబుషేన్‌ వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌ను ఔట్‌ చేసిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 71 ఓ‍వర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది.

చదవండి: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్‌

'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే'

మరిన్ని వార్తలు