FIH Pro League: ఆఖరి నిమిషంలో గోల్‌.. భారత్‌ను గెలిపించిన మన్‌దీప్‌

21 Mar, 2022 09:53 IST|Sakshi

భువనేశ్వర్‌: చివరి నిమిషంలో గోల్‌ చేసిన మన్‌దీప్‌ సింగ్‌ ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు ఐదో విజయాన్ని అందించాడు. అర్జెంటీనాతో ఆదివారం జరిగిన రెండో అంచె లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–3 గోల్స్‌ తేడాతో గెలిచింది.

భారత్‌ తరఫున హార్దిక్‌ సింగ్‌ (17వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (60వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... జుగ్‌రాజ్‌ సింగ్‌ (20వ, 52వ ని.లో) రెండు గోల్స్‌ సాధించాడు. ఈ విజయంతో భారత్‌ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.    

చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు