Women’s World Cup 2022: ఫామ్‌లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది

28 Feb, 2022 07:31 IST|Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (114 బంతుల్లో 103; 9 ఫోర్లు) సెంచరీ చేయగా, యస్తిక భాటియా (58; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించింది. దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 244 పరుగులు సాధించింది. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది.

గత కొంత కాలంగా ఫామ్‌లో లేకపోయినా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సెంచరీ సాధించడం జట్టుకు కలిసొచ్చే వచ్చే అంశం. ఇక ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన తలకు గాయమైంది. గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ ఆమె ఫీల్డ్‌ను వదిలి వెళ్లింది. ఇక ప్రపంచ కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది.

చదవండి: IND Vs SL:లంక‌ క్రికెట‌ర్లు ప్ర‌యాణించిన‌ బ‌స్సులో బుల్లెట్ల క‌ల‌క‌లం

మరిన్ని వార్తలు