Rohit Sharma And Rishab Pant Comedy During Toss.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు ప్రస్తుతం టీమిండియాకు కీలక ఆటగాళ్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిస్తే వారు చేసే అల్లరి మాములుగా ఉండదు. తాజాగా ఐపీఎల్లో ఇద్దరు వేర్వేరు జట్లకు కెప్టెన్లుగా ఉన్నప్పటికీ ఎక్కడ కలిసినా అదే ఫన్ క్రియేట్ అవడం సహజం. తాజాగా ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో రిషబ్ పంత్, రోహిత్శర్మల మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
చదవండి: Eoin Morgan: ఏంటి మోర్గాన్.. జట్టు మొత్తం ఓకే.. నీ పరిస్థితి ఏంటి!
రిఫరీ టాస్కు కాల్ ఇవ్వగానే రోహిత్ కాయిన్ ఎగిరేశాడు. పంత్ రిఫరీతో మేము మొదట బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. అని చెప్పాడు. దీనికి రోహిత్ వెంటనే.. ఏంటి మనిద్దరం కలిసి బౌలింగ్ చేద్దామా అన్నట్లుగా కామెంట్ చేశాడు. దీంతో పంత్ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ.. లేదు.. మేం మాత్రమే బౌలింగ్ ఎంచుకున్నాం అంటూ రిఫరీకి తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు ముంబై బ్యాటర్స్ ఏ దశలోనూ రాణించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
చదవండి: Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే
🚨 Toss Update from Sharjah 🚨@DelhiCapitals have elected to bowl against @mipaltan. #VIVOIPL #MIvDC
Follow the match 👉 https://t.co/Kqs548PStW pic.twitter.com/ERJAloH0vF
— IndianPremierLeague (@IPL) October 2, 2021