మన్‌ప్రీత్‌ సింగ్‌కూ ‘ఖేల్‌ రత్న’

3 Nov, 2021 05:32 IST|Sakshi

ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న’ అందుకోనున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల 11 మందికి ‘ఖేల్‌ రత్న’ ప్రకటించగా... తాజాగా ఈ జాబితాలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పేరును కూడా చేర్చారు. ఈ ఏడాది 35 మందికి ‘అర్జున’... పది మందికి ‘ద్రోణాచార్య’ అవార్డు... ఐదుగురికి ‘ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు ఇవ్వనున్నారు. ఈనెల 13న రాష్ట్రపతి భవన్‌లో 2021 జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.

మరిన్ని వార్తలు